News October 3, 2025
అర్ధసెంచరీలు చేసిన జురెల్, జడేజా

వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమ్ ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 218 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోగా జురెల్(68*), జడేజా(50*) అర్ధసెంచరీలతో ఇన్నింగ్సును చక్కదిద్దారు. ఐదో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 326/4 కాగా 164 రన్స్ ఆధిక్యంలో ఉంది.
Similar News
News October 3, 2025
కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ 2028లోగా పూర్తి: CM చంద్రబాబు

AP: ఈ నెల 16న PM మోదీ కర్నూలులో పర్యటించనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు CM చంద్రబాబు సూచించారు. కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీని 2028లోగా పూర్తి చేస్తామన్నారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా విజయవాడ ఉత్సవ్ తరహా ఈవెంట్లను అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో కొందరు MLAలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వారిని నియంత్రించే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు.
News October 3, 2025
భార్య రహస్య వీడియోలు ఫ్రెండ్స్కు పంపిన ప్రబుద్ధుడు

కట్టుకున్న భార్యతో పడక గదిలో గడిపిన సన్నివేశాలను రహస్యంగా వీడియోలు తీసి తన సహచరులకు పంపించాడో ప్రబుద్ధుడు. కర్ణాటక పుట్టెనహళ్లి ఈ ఘటన జరిగింది. అంతేకాక వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని భర్త సయ్యద్ ఇనాముల్ హక్, మామ వేధిస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిరాకరించడంతో వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారని పేర్కొంది. అప్పటికే పెళ్లయిన హక్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.
News October 3, 2025
మహిళా ఖైదీలకు ‘అపూర్వ’ కానుక

క్షణికావేశంలో తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు టీచర్గా మారారు అపూర్వ వివేక్. ఝార్ఖండ్ రాంచీకి చెందిన ఈమె 2013 నుంచి ఖైదీల సేవకే తన సమయాన్ని కేటాయించారు. న్యాయ సాయం అందించడమే కాకుండా వారికి, వారి పిల్లలకు చదువు చెబుతున్నారు. అలాగే వారిలో కుంగుబాటును నివారించడానికి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. బయటకు వచ్చిన వారికి పునరావాసం, ఉపాధి కల్పన కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.