News October 3, 2025
వరంగల్: ఆ సీఐ ముందు నుంచి వివాదాస్పదుడే..!

నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి ముందు నుంచి వివాదాస్పదుడిగా తెలుస్తోంది. గతంలో జనగామ సీఐగా పనిచేసిన సమయంలో అడ్వకేట్ అమ్భతరావు, అతడి భార్యను అదుపులోకి తీసుకున్న ఘటనలో భార్య ఎదుటే అడ్వకేట్ను అవమానపరిచాడనే ఆరోపణలతో సీపీ విచారణ జరిపారు. తాజాగా గాంధీ జయంతి రోజు నర్సంపేటలో జంతువధను చేస్తున్న సమయంలో కత్తితో త్వరగా కొట్టు అంటూ అనడంపై వివాదాస్పదమైంది. ఈ ఘటనపై DCP ఈస్ట్ జోన్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
Similar News
News October 3, 2025
మక్తల్లో దారుణం.. భార్యను చంపిన భర్త

మక్తల్ మండలం సత్యారంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి తన భార్య వినోద (33)న క్రూరంగా హత్య చేశాడు. భార్య చెయ్యి నరికి, కడుపులో పొడిచి, గోంతు కోసి భర్త పారిపోయాడు. ఈ దాడిలో వినోద అక్కడికక్కడే మృతి చెందారు. కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News October 3, 2025
‘చెరువులకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి’

జిల్లాలో 301 చెరువులకు నీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హెచ్ఎల్సీ, మైనర్ ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హెచ్ఎస్ఎస్ఎస్, హెచ్ఎల్సీ కింద ఉన్న చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరితగతిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
News October 3, 2025
జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ప్రకాశం SP

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా సందర్శించి, పలు విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలోని పూర్తి విభాగాలను రికార్డులను ఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రికార్డులు పెండింగ్ లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేయాలని సూచించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలన్నారు.