News October 3, 2025
‘కర్రల సమరంలో చనిపోయిన ఈ వ్యక్తిని గుర్తిస్తే చెప్పండి’

కర్నూలు(D) దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో జరిగిన కర్రల సమరంలో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతుల్లో ముగ్గురిని.. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజు, కర్ణాటకకు చెందిన బసవరాజుగా పోలీసులు గుర్తించారు. నాలుగో వ్యక్తి ఎడమ చేతిపై NBK అని పచ్చబొట్టు ఉందని, బంధువులు కానీ, మిత్రులు కానీ గుర్తిస్తే హొళగుంద ఎస్ఐ 91211 01161, ఆలూరు సీఐ 91211 01157 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
Similar News
News October 3, 2025
క్యారవాన్ టూరిజన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు: కలెక్టర్

జిల్లాకు వచ్చే పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందేలా చర్యలు తీసుకుంటామని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో క్యారవాన్ బస్సును పరిశీలించారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా క్యారవాన్ టూరిజం రానున్న రోజుల్లో నూతన వరవడిని చూపుతుందన్నారు. క్యారవాన్ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ బస్సు సూర్యలంక బీచ్లో శని, ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.
News October 3, 2025
నర్సంపేట ఘటనపై విచారణ కొనసాగుతోంది: సీపీ

నర్సంపేట పట్టణ కేంద్రంలో గాంధీ జయంతి వేళ సీఐ సమక్షంలో జంతు బలి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. గురువారం సాయంత్రం వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగగా పోలీసులు బందోబస్తు కోసం వెళ్లిన సమయంలో జంతు బలి జరిగింది.
News October 3, 2025
టాప్-50 రెస్టారెంట్స్.. HYDలో తినలేదా ఏంటి?

జొమాటో రూపొందించిన ‘కాండే నాస్ట్ IND’ టాప్-50 రెస్టారెంట్ జాబితాలో ముంబై నుంచి 13, బెంగళూరు, ఢిల్లీ నుంచి 9 చొప్పున చోటు దక్కించుకున్నాయి. టాప్-4లో ముంబైలోని ది టేబుల్, MASQUE, PAPA’S, ది బాంబే క్యాంటీన్ ఉన్నాయి. అయితే బిర్యానీ, ఇతర రుచులకు పేరుగాంచిన HYD నుంచి ఒక్క రెస్టారెంట్కూ చోటు దక్కకపోవడంపై విమర్శలొస్తున్నాయి. HYDలో తినకుండానే లిస్టు ప్రిపేర్ చేశారేమోనని పలువురు సెటైర్లు వేస్తున్నారు.