News October 3, 2025
దసరా.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

TG: దసరాకు ఈసారి మద్యం అమ్మకాలు భారీగా జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న గాంధీ జయంతి కావడంతో షాపులు మూసివేయగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న మొత్తం రూ.419 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. ఇందులో SEP 30నే రూ.333 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ఈ నెల 1న రూ.86 కోట్ల సేల్స్ జరిగాయని వెల్లడించారు. సాధారణంతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి అమ్మకాలు రెట్టింపయ్యాయని వెల్లడించారు.
Similar News
News October 3, 2025
మీ దసరా సెలవులు ముగిశాయా?

TGలో స్కూళ్లకు దసరా సెలవులు నేటితో ముగిశాయి. 13 రోజుల తర్వాత విద్యార్థులు రేపటి నుంచి బడిబాట పట్టనున్నారు. పల్లెలకు వెళ్లిన ఫ్యామిలీలు పట్నం చేరుకుంటున్నాయి. అయితే రేపు ఒక్కరోజు పాఠశాలకు వెళ్తే ఎల్లుండి ఆదివారం మళ్లీ హాలిడే రానుంది. దీంతో పిల్లలతో ఊరెళ్లిన చాలామంది పేరెంట్స్ మరో రెండు రోజులు అక్కడే ఉండి, సోమవారం నుంచి స్కూల్ పంపాలని చూస్తున్నారు. మరి మీ సెలవులు ముగిశాయా? ప్లాన్ ఏంటి? COMMENT
News October 3, 2025
టాప్-50 రెస్టారెంట్స్.. HYDలో తినలేదా ఏంటి?

జొమాటో రూపొందించిన ‘కాండే నాస్ట్ IND’ టాప్-50 రెస్టారెంట్ జాబితాలో ముంబై నుంచి 13, బెంగళూరు, ఢిల్లీ నుంచి 9 చొప్పున చోటు దక్కించుకున్నాయి. టాప్-4లో ముంబైలోని ది టేబుల్, MASQUE, PAPA’S, ది బాంబే క్యాంటీన్ ఉన్నాయి. అయితే బిర్యానీ, ఇతర రుచులకు పేరుగాంచిన HYD నుంచి ఒక్క రెస్టారెంట్కూ చోటు దక్కకపోవడంపై విమర్శలొస్తున్నాయి. HYDలో తినకుండానే లిస్టు ప్రిపేర్ చేశారేమోనని పలువురు సెటైర్లు వేస్తున్నారు.
News October 3, 2025
టికెట్ల విడుదల కాలాన్ని తగ్గించడంపై త్వరలో నిర్ణయం: సింఘాల్

AP: మూడు నెలల ముందే శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తుండటంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని TTD ఈవో అనిల్ సింఘాల్ అన్నారు. రైల్వే బుకింగ్ విధానాల్లో మార్పుల వల్ల దర్శనాలకు ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నట్లు తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకొని, టికెట్ల విడుదల కాలాన్ని 15 రోజులు/నెల లేదా 45 రోజులు/2 నెలలకు కుదించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.