News October 3, 2025

కుందేళ్ల పెరుగుదలకు మేలైన ఆహారం

image

పుట్టిన 12 రోజుల తర్వాత నుంచి కుందేలు పిల్లలు ఆహారం తింటాయి. కుందేళ్లకు గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలు తగిన పరిమాణంలో కలిపి మేతగా అందించాలి. లూసర్న్, బెర్సీమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, చిక్కుడు, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వవచ్చు. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి.
<<-se>>#RABBIT<<>>

Similar News

News October 3, 2025

మీ దసరా సెలవులు ముగిశాయా?

image

TGలో స్కూళ్లకు దసరా సెలవులు నేటితో ముగిశాయి. 13 రోజుల తర్వాత విద్యార్థులు రేపటి నుంచి బడిబాట పట్టనున్నారు. పల్లెలకు వెళ్లిన ఫ్యామిలీలు పట్నం చేరుకుంటున్నాయి. అయితే రేపు ఒక్కరోజు పాఠశాలకు వెళ్తే ఎల్లుండి ఆదివారం మళ్లీ హాలిడే రానుంది. దీంతో పిల్లలతో ఊరెళ్లిన చాలామంది పేరెంట్స్ మరో రెండు రోజులు అక్కడే ఉండి, సోమవారం నుంచి స్కూల్‌ పంపాలని చూస్తున్నారు. మరి మీ సెలవులు ముగిశాయా? ప్లాన్ ఏంటి? COMMENT

News October 3, 2025

టాప్-50 రెస్టారెంట్స్.. HYDలో తినలేదా ఏంటి?

image

జొమాటో రూపొందించిన ‘కాండే నాస్ట్ IND’ టాప్-50 రెస్టారెంట్ జాబితాలో ముంబై నుంచి 13, బెంగళూరు, ఢిల్లీ నుంచి 9 చొప్పున చోటు దక్కించుకున్నాయి. టాప్-4లో ముంబైలోని ది టేబుల్, MASQUE, PAPA’S, ది బాంబే క్యాంటీన్ ఉన్నాయి. అయితే బిర్యానీ, ఇతర రుచులకు పేరుగాంచిన HYD నుంచి ఒక్క రెస్టారెంట్‌‌కూ చోటు దక్కకపోవడంపై విమర్శలొస్తున్నాయి. HYDలో తినకుండానే లిస్టు ప్రిపేర్ చేశారేమోనని పలువురు సెటైర్లు వేస్తున్నారు.

News October 3, 2025

టికెట్ల విడుదల కాలాన్ని తగ్గించడంపై త్వరలో నిర్ణయం: సింఘాల్

image

AP: మూడు నెలల ముందే శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తుండటంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని TTD ఈవో అనిల్ సింఘాల్ అన్నారు. రైల్వే బుకింగ్ విధానాల్లో మార్పుల వల్ల దర్శనాలకు ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నట్లు తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకొని, టికెట్ల విడుదల కాలాన్ని 15 రోజులు/నెల లేదా 45 రోజులు/2 నెలలకు కుదించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.