News October 3, 2025

భారీ వర్షాలకు నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం

image

AP: వర్షాలు, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ₹4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని CM చంద్రబాబు ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. వరదలపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో మరింత వరద పోటెత్తుతోందని వారు తెలిపారు. వానలతో నలుగురు మృతి చెందారన్నారు. పంట నష్టంపై నివేదికలివ్వాలని సూచించారు.

Similar News

News October 3, 2025

‘నాసా’ ఆపరేషన్స్ నిలిపివేత.. కారణమిదే!

image

ప్రభుత్వ నిధుల లోపం కారణంగా తమ ఆపరేషన్స్‌ను నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ఏజెన్సీని మూసివేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. అక్కడి కాంగ్రెస్ కొత్త బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం <<17882827>>షట్‌డౌన్<<>> అయిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ షట్‌డౌన్ కారణంగా ISS, స్పేస్‌క్రాఫ్ట్ వంటి క్రిటికల్ ఆపరేషన్స్ మినహా మిగతా ప్రాజెక్టులను నాసా నిలిపివేసింది.

News October 3, 2025

‘శ్వేతనాగు’ సినిమా రచయిత కన్నుమూత

image

ప్రముఖ రచయిత లల్లా దేవి (82) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా నిమ్మగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు. ‘లల్లా దేవి’ పేరిట కథలు, నవలలు రాశారు. దివంగత నటి సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ‘శ్వేతనాగు’ సినిమాకు కథ అందించారు. 150కి పైగా నవలలు, నాటకాలు రచించారు. వాటిలో ఆమ్రపాలి, మహామంత్రి తిమ్మరుసు వంటి నవలలు పాపులర్ అయ్యాయి.

News October 3, 2025

అనిల్ అంబానీ పిటిషన్‌ను కొట్టేసిన బాంబే హైకోర్టు

image

తన కంపెనీ అకౌంట్లను ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ SBI ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టేయాలని Reliance(ADA)Group ఛైర్మన్ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంటు, అంతర్గత విధానాలపై RBI ఆదేశాల ప్రకారం అనిల్ కంపెనీ అకౌంట్లను బ్యాంకు జూన్‌లో ఫ్రాడ్‌గా పేర్కొంది. అయితే ముందుగా తన వాదనలను వినలేదని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అనిల్ తరఫు లాయర్లు వాదించారు.