News October 3, 2025
నరసరావుపేట: ఈ నెల 6న స్వచ్ఛ అవార్డులు

రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అక్టోబర్ 6న ప్రదానం చేయనున్నామని కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛతా ఎన్జీఓగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎంపికైంది వెల్లడించారు. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది అవార్డులు దక్కించుకున్నాయన్నారు. SASA పోర్టల్ (https://sasa.ap.gov.in/) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
Similar News
News October 3, 2025
NTR: 9,452 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రేపే నగదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ నూతన పథకాన్ని శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 9,452 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల వివరాలను అధికారులు పరిశీలించి, అప్లికేషన్లను మంజూరు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది.
News October 3, 2025
కృష్ణా: 11,316 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రేపే నగదు

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ద్వారా కృష్ణా జిల్లాలో 11,316 మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. ఒకొక్క లబ్ధిదారునికి రూ.15వేలు చొప్పున రూ.16 కోట్ల 97లక్షల 40 వేలు బ్యాంక్ ఖాతాల్లో శనివారం జమ కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకొక్కరికి రూ.10 వేలు చొప్పున ఇవ్వగా కూటమి ప్రభుత్వం రూ.15 వేలు ఆర్థిక సాయాన్ని ఇస్తుండటం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News October 3, 2025
గుంటూరులో ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో ఎస్పీ

SP వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో పాల్గొన్నారు. ఐదుగురు పోలీస్ సిబ్బంది తమ బదిలీ, సర్వీస్ సంబంధిత సమస్యలపై వినతి పత్రాలను SPకి సమర్పించారు. SP వాటిని సానుకూలంగా స్వీకరించి, సంబంధిత అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి, వారి వినతుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని SP పేర్కొన్నారు.