News October 3, 2025
HYD: లాడ్జీలో యువతి స్నానం.. వీడియో తీసిన యువకులు

విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి ఓ లాడ్జీలో యువతి స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి ఇద్దరు యువకులు వీడియో తీశారు. గమనించిన ఆమె కేకలు వేయడంతో ఆకతాయిలు పారిపోయారు. ఈ విషయమై స్థానిక గవర్నర్పేట PSలో ఫిర్యాదు చేయగా యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Similar News
News October 4, 2025
HYD: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ప్రవేశాలు

హైదరాబాద్లోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ విద్యతో పాటు క్రీడలు, విలువల ఆధారిత బోధన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంచేలా విద్యావిధానం ఉంటుంది. మరిన్ని వివరాలకు 9059196161 ద్వారా లేదా yipschool.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
News October 4, 2025
HYD: బాలికను చంపి.. వాటర్ ట్యాంకులో పడేశారు.!

మాదన్నపేటలో ఏడేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో అల్లరి చేస్తుందనే కోపంతో మేనమామ, అత్త కలిసి బాలికను కిరాతకంగా చంపినట్లు తేలింది. చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి వాటర్ ట్యాంకులో పడేశారని పోలీసులు తెలిపారు. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
News October 3, 2025
HYDకు క్యూ కట్టారు.. భారీగా ట్రాఫిక్ జామ్

దసరా పండుగ ముగియడంతో సొంతూరు వెళ్లిన జనం నగరానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో HYD-విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. చిట్యాల టోల్గేట్ వద్ద కిలో మీటర్ మేర వాహనాల కదలిక మందగించింది. ORR నుంచి హయత్నగర్ మీదుగా ఎల్బీనగర్ రూట్లోనూ ఇదే పరిస్థితి ఉంది. బోడుప్పల్, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ రూట్లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.