News October 3, 2025
ఈ-కామర్స్ సైట్లలో అదనపు ఛార్జీలు.. కేంద్రమంత్రి స్పందనిదే!

ఈ-కామర్స్ సైట్లలో ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు & పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజు అంటూ ఎక్స్ట్రా ఛార్జీలను వసూలు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. దీనిపై ఓ నెటిజన్ ట్వీట్ చేయగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ‘COD కోసం ఈ-కామర్స్ సైట్స్ అదనంగా ఛార్జీలు వసూలు చేయడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఫిర్యాదులొచ్చాయి. వీటిపై దర్యాప్తు ప్రారంభమైంది. నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
Similar News
News October 3, 2025
రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు!

ఈనెల 19 నుంచి AUSతో జరగనున్న వన్డే సిరీస్కు రేపు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ వన్డేలు మినహా టెస్ట్, టీ20ల నుంచి రిటైరైన విషయం తెలిసిందే. దీంతో AUSతో మ్యాచులకు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలారోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న ‘రోకో’ జోడీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు కెప్టెన్గా రోహిత్ను కొనసాగిస్తారా లేక మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.
News October 3, 2025
విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్ అయిందా?

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పలువురు నెటిజన్లు వారికి విషెస్ తెలియజేస్తున్నారు. దీనిపై వారిద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నట్లు గతంలోనూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు.
News October 3, 2025
తాజా సినీ ముచ్చట్లు

☞ ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభం
☞ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో విలన్గా షైన్ టామ్ చాకో?
☞ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మూవీకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు టాక్
☞ కొనసాగుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. అక్టోబర్ 31న థియేటర్లలోకి