News October 3, 2025
కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ 2028లోగా పూర్తి: CM చంద్రబాబు

AP: ఈ నెల 16న PM మోదీ కర్నూలులో పర్యటించనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు CM చంద్రబాబు సూచించారు. కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీని 2028లోగా పూర్తి చేస్తామన్నారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా విజయవాడ ఉత్సవ్ తరహా ఈవెంట్లను అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో కొందరు MLAలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వారిని నియంత్రించే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు.
Similar News
News October 4, 2025
₹5కోట్ల ఇన్సూరెన్స్… హత్య చేసి ఆపై క్లెయిమ్ కోసం నాటకం

ఓ గ్యాంగ్ ₹5.2కోట్ల ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తిని హత్యచేసి ఆ మొత్తం క్లెయిమ్కోసం నకిలీ భార్యతో డ్రామా ఆడించింది. పక్షవాతం ఉన్న కౌల్పేట్ (KA)కు చెందిన గంగాధర్కు బీమా ఉంది. గమనించిన ముఠా అతణ్ని చంపి బాడీని టూవీలర్పై పెట్టి కారుతో గుద్దించింది. ముఠాలోని మహిళతో CLAIM చేయించింది. డెడ్బాడీ విషయం తెలిసి పోలీసులు అసలు భార్యను విచారించగా టూవీలర్ లేదని తేలింది. తీగలాగి మొత్తం ముఠాను అరెస్టు చేశారు.
News October 3, 2025
రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు!

ఈనెల 19 నుంచి AUSతో జరగనున్న వన్డే సిరీస్కు రేపు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ వన్డేలు మినహా టెస్ట్, టీ20ల నుంచి రిటైరైన విషయం తెలిసిందే. దీంతో AUSతో మ్యాచులకు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలారోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న ‘రోకో’ జోడీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు కెప్టెన్గా రోహిత్ను కొనసాగిస్తారా లేక మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.
News October 3, 2025
విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్ అయిందా?

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పలువురు నెటిజన్లు వారికి విషెస్ తెలియజేస్తున్నారు. దీనిపై వారిద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నట్లు గతంలోనూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు.