News October 3, 2025

‘భూపాలపల్లి ఏరియాలో 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం’

image

భూపాలపల్లి ఏరియాలో 100 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ముందుకెళ్లాలని సింగరేణి ఏరియా మేనేజర్ ఏ.రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కార్యాచరణ ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 100 మిలియన్ టన్నులు సాధించే దిశగా ఏరియాలో, సంస్థలో చేపట్టాల్సిన కొత్త ఆవిష్కరణలపై చర్చించారు.

Similar News

News October 4, 2025

బందీల విడుదలకు హమాస్ అంగీకారం

image

ఇజ్రాయెలీ బందీలు(మృతులు/బతికున్నవారు) అందరినీ రిలీజ్ చేసేందుకు హమాస్ అంగీకరించింది. ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే మధ్యవర్తుల ద్వారా ఈ ప్లాన్‌పై చర్చించాలని ప్రకటన రిలీజ్ చేసింది. అరబ్, ఇస్లామిక్ తదితర దేశాలు, ట్రంప్‌ ప్రయత్నాలను స్వాగతిస్తున్నామంది. అధికారం వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2023 OCTలో మొదలైన వార్‌కు త్వరలో తెరపడే అవకాశముంది.

News October 4, 2025

మెదక్: భవనం పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్‌

image

మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశిస్తూ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. అనుకున్న సమయం కంటే ముందే భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

News October 4, 2025

అభివృద్ధికి అడ్డుపడుతూ వైసీపీ సైకోయిజం: గంటా

image

AP: రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ YCP సైకోయిజాన్ని ప్రదర్శిస్తోందని TDP MLA గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ‘ప్రభుత్వం 15 నెలల్లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. ఇది జీర్ణించుకోలేక ప్రాజెక్టులు అడ్డుకునేందుకు YCP కుట్రలు చేస్తోంది. విశాఖలో TCSకు ఎకరా 99 పైసలకే ఇచ్చారని హైకోర్టుకెళ్లి మొట్టికాయలు తిన్నారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్‌ను ఆపాలని చూస్తున్నారు’ అని ఓ ప్రకటనలో విమర్శించారు.