News October 4, 2025

VZM: 2 రోజుల్లో రూ.12.50 కోట్ల మద్యం తాగేశారు..!

image

విజయనగరం జిల్లాలో దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. అక్టోబర్ 2న విజయదశమి రోజే గాంధీ జయంతి కావడంతో మద్యం షాపులుకు సెలవు ప్రకటించింది. దీంతో మందుబాబులు సెప్టెంబర్ 30, అక్టోబరు 1వ తేదీల్లో వైన్ షాపుల ముందు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు. రెండురోజుల్లో రూ.12.50 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

Similar News

News October 4, 2025

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిరసన

image

గ్రామ, వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీలకు ఎంపీహెచ్‌ఎ (ఎఫ్) లుగా పదోన్నతి కల్పించాలని శుక్రవారం అర్ధరాత్రి జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిద్రచేసి నిరసన తెలిపారు. ఆరు నెలలుగా పదోన్నతులకు సంబంధించిన జీవో జారీ చేసి ఇంతవరకు ప్రమోషన్ లిస్టు ప్రకటించలేదన్నారు. ప్రమోషన్ లిస్టును ప్రకటించేంతవరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని నిరసన తెలుపుతామని సచివాలయాల హెల్త్ సెక్రటరీలు ప్రకటించారు.

News October 4, 2025

VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విజయనగరంలోని కాటవీధిలో కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. ఎల్.వెంకటేశ్వరరావు (41) కాట వీధిలో వెల్డింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. దసరా రోజు షాపులో పూజలు చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి సాయంత్రం షాపును తెరుస్తుండగా విద్యుత్ కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. 108లో జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 3, 2025

VZM: ‘ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం’

image

భారీ వర్షాల పట్ల అప్రమతంగా ఉండాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని ఆదేశించారు. శుక్రవారం వర్షం నష్టంపై జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.