News October 4, 2025
సంగారెడ్డి: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం

జిల్లాలో గత నెల 21 నుంచి ఈనెల 3 వరకు దసరా సెలవులు ఇవ్వడంతో అవి పూర్తి కావడంతో నేటి నుంచి అన్ని రకాల పాఠశాలలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలోని పరిసరాలను పరిశుభ్రం చేసిన తర్వాతనే విద్యార్థులను తరగతి గదులలో కూర్చోబెట్టాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.
Similar News
News October 4, 2025
PHOTO: ఆటో డ్రైవర్ గెటప్లో హోంమంత్రి

హోం మంత్రి వంగలపూడి అనిత ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆటో డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆటోలో ప్రయాణం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన ఆమె వారికి చెక్కు అందజేశారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన కూటమి ప్రభుత్వం కొత్తగా ఈ పథకాన్ని అమలు చేసి ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిందన్నారు.
News October 4, 2025
PDPL: ముగిసిన పండుగలు.. కళ తప్పిన వేదికలు

గత నెలరోజులకు పైగా గణేష్, బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలతో సందడిగా మారిన పల్లెలు, పట్టణాల్లో వేడుకలు జరిగిన ప్రదేశాలు నేడు కళ తప్పి బోసిపోయి కనిపిస్తున్నాయి. గణపతి మండపాలను నిర్మించే సమయం నుంచి మొన్న ముగిసిన దసరా ఉత్సవాల వరకు వయసుతో సంబంధం లేకుండా అందరు పండుగలను ఘనంగా నిర్వహించడానికి సహకరించారు. భజన కీర్తనలు, DJ సౌండ్ బాక్సుల మోతలతో ఆడిపాడిన ఉత్సవాల వేదికలు తీపి జ్ఞాపకాలను మిగిల్చాయి.
News October 4, 2025
రోహిత్ ఫ్యాన్స్కు హార్ట్ బ్రేక్!

భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే టెస్టులు, T20లకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. AUSతో వన్డే సిరీస్కు ఆయనను కాదని <<17911822>>గిల్కు<<>> కెప్టెన్సీ అప్పగించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఆసీస్ సిరీస్ తర్వాత హిట్మ్యాన్ వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీరేమంటారు?