News October 4, 2025

డబ్బులు పడకపోతే రిపోర్ట్ చేయండి: CBN

image

AP: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం అమలుతో డ్రైవర్లు పండగ వాతావరణంలో ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. చెప్పిన సమయానికే అకౌంట్లలో డబ్బులు జమ చేశామని చెప్పారు. చరిత్రలో ఎరుగని విధంగా 2024లో 94% సీట్లు కట్టబెట్టారని, రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలని సీఎం కోరారు. అర్హుల అకౌంట్లలో డబ్బులు పడకపోతే అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బులు వేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు.

Similar News

News October 4, 2025

వెస్టిండీస్.. ఇదేం ఆట!

image

ఒకప్పుడు వెస్టిండీస్ జట్టంటే విధ్వంసకర బ్యాటర్లు, నిప్పులు చెరిగే బౌలర్లతో నిండి ఉండేది. ఇప్పుడు కనీసం పోటీ ఇవ్వలేని దీనస్థితికి దిగజారింది. భారత్‌తో తొలి టెస్టులో కనీసం 2 రోజులు కూడా నిలబడలేకపోయింది. నిలకడ లేని ఆటగాళ్లున్న WIకు టెస్టులు సెట్ కావడం లేదు. ఒకవేళ ఆడించినా IND, AUS, ENG, NZ, SAతో కాకుండా చిన్న దేశాలతోనే సిరీస్‌లు నిర్వహించాలని క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. మీ కామెంట్?

News October 4, 2025

BREAKING: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

image

TG: హైదరాబాద్, సికింద్రాబాద్‌ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఇ-ఆర్డినరీ, ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలుకానున్నాయి.

News October 4, 2025

కూటమి నేతలతో కలిసే వెళ్లాలి: పవన్ కళ్యాణ్

image

AP: క్షేత్రస్థాయిలో పరిస్థితులను సరిదిద్దుకొంటూ ముందుకెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న ఆయన క్షేత్ర స్థాయిలో కూటమి నేతలతో కలిసే పనిచేయాలని స్పష్టం చేశారు. అభిప్రాయ భేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు.