News October 4, 2025
మీ ‘మలం’ మిమ్మల్ని హెచ్చరిస్తుంది!

మలం రంగు ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘ముదురు రంగు రక్తస్రావాన్ని, ఆకుపచ్చ వేగవంతమైన జీర్ణక్రియను, లేత రంగు కాలేయ సమస్యలను సూచిస్తుంది. మలం తేలియాడుతుంటే అధిక కొవ్వు, గట్టిగా ఉంటే మలబద్ధకం ఉన్నట్టు. నీరుగా ఉంటే అంటువ్యాధులు లేదా ప్రేగుల్లో మంటకు సంకేతం. తీవ్ర వాసన పేలవమైన జీర్ణక్రియను సూచిస్తుంది’ అని తెలిపారు. ఇవి దీర్ఘకాలంగా ఉంటే వైద్యుడ్ని సంప్రదించాలి.
Similar News
News October 4, 2025
స్థానిక ఎన్నికలపై SEC కాల్ సెంటర్

TG: స్థానిక ఎన్నికలకు రెడీగా ఉన్నామని కోర్టుకు నివేదించినందున SEC తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. BC రిజర్వేషన్లపై ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. అయితే ఎన్నికలకు అనుమతిస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు కష్టమవుతుందనే కొన్ని ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు స్వీకరించేందుకు 92400 21456 నంబర్తో తాజాగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.
News October 4, 2025
వెస్టిండీస్.. ఇదేం ఆట!

ఒకప్పుడు వెస్టిండీస్ జట్టంటే విధ్వంసకర బ్యాటర్లు, నిప్పులు చెరిగే బౌలర్లతో నిండి ఉండేది. ఇప్పుడు కనీసం పోటీ ఇవ్వలేని దీనస్థితికి దిగజారింది. భారత్తో తొలి టెస్టులో కనీసం 2 రోజులు కూడా నిలబడలేకపోయింది. నిలకడ లేని ఆటగాళ్లున్న WIకు టెస్టులు సెట్ కావడం లేదు. ఒకవేళ ఆడించినా IND, AUS, ENG, NZ, SAతో కాకుండా చిన్న దేశాలతోనే సిరీస్లు నిర్వహించాలని క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. మీ కామెంట్?
News October 4, 2025
BREAKING: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

TG: హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఇ-ఆర్డినరీ, ఇ-ఎక్స్ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలుకానున్నాయి.