News October 4, 2025
అమెరికాలో 2.3 కోట్ల మంది మిలియనీర్లు!

ప్రపంచంలో అత్యధిక మిలియనీర్లు అమెరికాలో ఉన్నట్లు ‘UBS గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025’ తెలిపింది. అక్కడ ఏకంగా 2.3 కోట్ల మంది మిలియనీర్లు ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత చైనా (63లక్షలు), ఫ్రాన్స్ (29లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం 9.17 లక్షల మంది మిలియనీర్లతో 14వ స్థానంలో నిలిచింది. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ కూడా మొదటి 15 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
Similar News
News October 4, 2025
Inspiration: చెట్టు నేర్పే జీవిత పాఠమిదే!

ప్రపంచంలో ప్రతి వస్తువు, జీవి మనకు పాఠాలను నేర్పిస్తూనే ఉంటాయి. చెట్టు కూడా లక్ష్యాలను చేరుకోవడానికి కొన్ని పాఠాలు నేర్పిస్తోంది. సన్లైట్ కోసం మొక్క వంగినట్టుగా ఎదగడానికి అవకాశాలున్నప్పుడు దారి మార్చుకోవడానికైనా వెనకాడొద్దు. వేర్లలా కలిసిమెలిసి ఉండటం అలవరుచుకోవాలి. ఆకులు రాల్చినట్లుగా అనవసర విషయాలను వదిలేయాలి. ఎప్పుడో కాసే పండ్ల కోసం చెట్టు ఎదిగినట్లుగా మనమూ లక్ష్యం కోసం కష్టపడుతూనే ఉండాలి.
News October 4, 2025
7న పార్టీ కీలక నేతలతో జగన్ సమావేశం

AP: YCP చీఫ్ జగన్ ఈనెల 7న తాడేపల్లిలో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో భేటీ అవుతారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. 8న భీమవరంలో EX MLA ప్రసాదరాజు కుమారుడి పెళ్లికి హాజరవుతారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు అడ్డుకొనేందుకు 9వ తేదీన మాకవరపాలెం(M) భీమబోయినపాలేనికి వెళ్తారని పార్టీ పేర్కొంది. అక్కడ నిలిచిపోయిన వైద్య కళాశాలను సందర్శిస్తారు.
News October 4, 2025
పెట్రోల్ కొట్టిస్తున్నారా?.. ఇలా జరిగితే అంతే!

ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన E20 పెట్రోల్ చాలా బంకుల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పెట్రోల్ వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా బంక్ యాజమాన్యాలు అవగాహన కల్పిస్తున్నాయి. ‘ఇథనాల్ నీటిని వేగంగా ఆకర్షిస్తుంది. వాషింగ్ & వర్షాల సమయంలో ట్యాంకులోకి నీరు చేరకుండా చూసుకోవాలి. నీరు తగిలితే ట్యాంకులో ఓ ప్రత్యేకమైన పొర ఏర్పడి వాహనం స్టార్ట్ కావడం కష్టతరమవుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.