News October 4, 2025
ఖమ్మం: ప్రేమ పేరుతో మోసం.. యువతి అనుమానాస్పద మృతి

ప్రేమ పేరిట మోసం చేశాడని 3నెలలుగా ప్రియుడి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఓ యువతి చనిపోయింది. స్థానికుల వివరాలు.. పాల్వంచ వాసి ప్రియాంక, గట్టు(M) చిన్నోనిపల్లి వాసి PC రఘుగౌడ్ 4ఏళ్లుగా ప్రేమించుకోగా, ఇటీవల తనను దూరం పెడుతుండటంతో రఘు ఇంటి వద్దే ఆమె నిరసనకు దిగింది. ఈ రోజు యువతి మృతిచెందటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతికి రఘు బంధువులే కారణమని యువతి తరఫువారు ఆరోపిస్తున్నారు.
Similar News
News October 5, 2025
నిజాసాగర్ 6గేట్ల నుంచి 51,761 క్యూసెక్కులు విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. శనివారం సాయంత్రం 51,761 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 6 వరద గేట్లను ఎత్తి 51,762 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.687 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.
News October 5, 2025
ఆలస్యం చేస్తే ఊరుకోను.. ట్రంప్ వార్నింగ్

తన ప్రకటనపై హమాస్ వేగంగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు <<17906657>>ట్రంప్ హెచ్చరించారు<<>>. ‘బందీలను విడుదల చేసేందుకు, శాంతి ఒప్పందాన్ని అమలు చేసేందుకు తాత్కాలికంగా బాంబింగ్ ఆపినందుకు ఇజ్రాయెల్ను అభినందిస్తున్నా. హమాస్ వైపు నుంచి ఏదైతే జరుగుతుందని అందరూ భావిస్తున్నారో అలాంటి ఆలస్యాన్ని నేను సహించను. బందీలను విడుదల చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరిస్తాం’ అని SMలో పోస్ట్ చేశారు.
News October 5, 2025
జీఎస్టీతో పరిశ్రమలకు లబ్ధి: కలెక్టర్

భారతదేశంలో GST సంస్కరణల అమలుతో జౌళి, విద్యుత్, చేనేత పరిశ్రమలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ 2.0పై నెల రోజులపాటు జరిగే అవగాహన సదస్సులో భాగంగా ‘సూపర్ సేవింగ్స్’ అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సేల్స్ టాక్స్, కమర్షియల్ టాక్స్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.