News October 4, 2025

గోదావరి ఫేజ్- 2&3 పనులు త్వరలో ప్రారంభం

image

గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2&3 ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభించాలని జలమండలి MD అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ప్రాజెక్టులో భాగంగా ఘన్‌పూర్ వద్ద నిర్మించనున్న మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు రూ.7,360 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. మూసీ పునరుజ్జీవనం, జంట జలాశయాలను గోదావరితో నింపడానికి ఈ ఫేజ్ 2, 3కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Similar News

News October 5, 2025

HYD: వచ్చే వారం హౌసింగ్ బోర్డు భూముల విక్రయాలు

image

హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో OCT 6 నుంచి GHMC పరిధి, శివారులో ఖాళీ ప్లాట్ల విక్రయాలు జరగనున్నాయి. సోమవారం చింతల్, నిజాంపేట, బాచుపల్లిలో ఉన్న 22 రెసిడెన్షియల్ ప్లాట్స్‌, ఫ్లాట్లను బహిరంగ వేలం ద్వారా అమ్ముతారు. 7, 8న KPHBలో 4 కమర్షియల్ ప్లాట్లు, నాంపల్లిలోని 1148 చదరపు గజాల ప్లాట్‌ను E-వేలం వేస్తారు. అక్టోబర్ 9, 10 తేదీల్లో చింతల్(కమర్షియల్ భూమి), రావిర్యాలకు సంబంధించిన భూములకు E-వేలం ఉంటుంది.
SHARE IT

News October 4, 2025

HYDకు తొలి టెస్లా.. కొన్నది ఇతనే!

image

కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి సీనియర్ సర్జన్ డా.ప్రవీణ్ Tesla Model Y కొనుగోలు చేశారు. తనకు భద్రకాళీ అమ్మవారు సెంటిమెంట్ అనుకుంటా! ఈ దసరాకి అక్కడే వాహన పూజ చేయించారు. ‘వాహన పూజ చేయించకుంటే భారతీయ సంస్కృతిలో టెస్లానే కాదు ఏ కారు అయినా 5 స్టార్ రేటింగ్ పొందదు’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, TGలో తొలి టెస్లా కారు ప్రవీణ్ కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు ధర (ex-showroom) రూ.59.89 లక్షలుగా ఉంది.

News October 4, 2025

అమెరికాలో LBనగర్ యువకుడి మృతి.. CM దిగ్భ్రాంతి

image

అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో LBనగర్ వాసి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనను కలిగించిందని CM రేవంత్ అన్నారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని CM ట్వీట్ చేశారు.