News October 4, 2025
ములుగు: ఎంపీటీసీనా.. లైట్ తీసుకో..!

మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు ఆశించిన స్పందన కనిపించట్లేదని అంటున్నారు గ్రౌండ్ రియాలిటీ గమనించిన పొలిటికల్ అనలిస్ట్లు. గడిచిన పదేళ్లలో ఎంపీపీలు, ఎంపీటీసీల పవర్ తగ్గుతూ వచ్చింది. విధులు, నిధులు లేకపోవడంతో మండల పరిషత్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. ‘ఎన్నికల ఖర్చు తప్ప విలువలేని పదవి’ అంటూ చాలామంది మదనపడ్డారు. దీంతో ఈసారి పోటీకి ఎవరూ ఆసక్తి చూపట్లేదు. ములుగు జిల్లాలో 69 స్థానాలు ఉన్నాయి.
Similar News
News October 5, 2025
సంగారెడ్డి: ప్రజావాణి కార్యక్రమం నిలిపివేత: కలెక్టర్

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య శనివారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజావాణి యథావిధిగా పునఃప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు.
News October 5, 2025
భారత్తో మ్యాచ్.. పాక్ కెప్టెన్ ఏమన్నారంటే?

ఉమెన్స్ క్రికెట్ WCలో ఇవాళ INDతో మ్యాచులో తమ ఆటతీరుపైనే ఫోకస్ పెడతామని PAK కెప్టెన్ ఫాతిమా సనా తెలిపారు. గతంలో ఇరు జట్ల ప్లేయర్లు ఫ్రెండ్లీగా ఫొటోలు దిగగా, ప్రస్తుత పరిస్థితులపై ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ‘అన్ని జట్ల ప్లేయర్లతో మాకు మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తాం. గేమ్ స్పిరిట్కు అనుగుణంగా నడుచుకుంటాం. మా దృష్టంతా క్రికెట్పైనే’ అని స్పష్టం చేశారు.
News October 5, 2025
పిల్లల ఆధార్లో ఫ్రీగా బయోమెట్రిక్ అప్డేషన్: UIDAI

పిల్లల ఆధార్లో మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్కు అయ్యే ఛార్జీలను ఏడాది పాటు రద్దు చేస్తున్నట్లు UIDAI ప్రకటించింది. 5-7, 15-17 ఏళ్ల వయసున్న పిల్లలు ఉచితంగా బయోమెట్రిక్, ఐరిస్, ఫొటో అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. UIDAI రూల్ ప్రకారం పిల్లలకు ఐదేళ్ల వయసులో ఒకసారి, ఆ తర్వాత 15 ఏళ్లు వచ్చాక మరోసారి బయోమెట్రిక్స్, ఫొటో అప్డేషన్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.