News October 4, 2025

భట్టిప్రోలులో మామను కొట్టిన చంపిన అల్లుడు: SI

image

అల్లుడు మామను కొట్టి చంపిన ఘటన భట్టిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. SI శివయ్య వివరాల మేరకు.. అద్దేపల్లికి చెందిన కారుమూరి రాంబాబును అతని చిన్న అల్లుడు ఏసు తీవ్రంగా కొట్టి చంపాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ వీరాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 5, 2025

సూర్యాపేట: పోలీస్ వాహన విడిభాగాలకు బహిరంగ వేలం

image

సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు చెందిన వాహనాలకు సంబంధించిన ఉపయోగించిన బ్యాటరీలు, టైర్లు, ఇతర విడిభాగాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు.ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఇందిరమ్మ కాలనీలోని పాత ఎస్పీ కార్యాలయంలో బహిరంగ వేలం పాట ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు 8712686019 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News October 5, 2025

ఈ 6 గంటల్లోనే రోడ్డు ప్రమాదాలెక్కువ!

image

TG: రాష్ట్రంలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజాగా వెల్లడించింది. 22,903 యాక్సిడెంట్లలో 7,660 మంది చనిపోయారని పేర్కొంది. ఏటా నమోదవుతున్న రోడ్డు ప్రమాదంలో 75% మ.3 నుంచి రా.9 గంటల మధ్యే జరుగుతున్నాయని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలుగా పేర్కొంది. 2023లో ఈ 6 గంటల వ్యవధిలో మొత్తం 8,775 యాక్సిడెంట్లు జరిగాయి.

News October 5, 2025

NZB: నవరాత్రుల్లో మహిళలను వేధించినందుకు19 కేసులు: CP

image

దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాలలో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధించిన సందర్భాలలో 19 కేసులు నమోదు చేసినట్లు NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. షీ టీం బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించిందన్నారు. అలాగే సెప్టెంబర్ నెలలో షీ టీం బృందాల ద్వారా 11 ఈ పెట్టీ కేసుల నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.