News October 5, 2025
80’s రీయూనియన్.. చెన్నైకి చిరు, వెంకీ

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి చెన్నై వెళ్లారు. అక్కడ జరిగే 80’s రీయూనియన్లో వారు పాల్గొననున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 80వ దశకంలో కలిసి నటించిన హీరోలు, హీరోయిన్లు ఒకే చోట కలవనున్నారు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడుపుతారు. గతంలోనూ ఇలా చాలా సార్లు కలిశారు. కాగా ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ మామ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు.
Similar News
News October 5, 2025
నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత

బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్(94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘అమర్ భూపాలి’ అనే మరాఠీ మూవీతో తెరంగేట్రం చేసిన ఆమె ‘జనక్ జనక్ పాయల్ బాజే, స్త్రీ, పింజారా, నవరంగ్’ వంటి హిందీ, మరాఠీ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె భర్త శాంతారామ్ లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్గా పేరొందారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
News October 5, 2025
PHC వైద్యుల డిమాండ్లు పరిష్కరిస్తాం: మంత్రి సత్యకుమార్

AP: PHC వైద్యుల డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. SEP 28 నుంచి చేస్తున్న ఆందోళన విరమించి విధుల్లో చేరాలని కోరారు. శనివారం రాత్రి వైద్యారోగ్య అధికారులతో అత్యవసర సమావేశమైన ఆయన మాట్లాడారు. వైద్యుల డిమాండ్లపై CMతో చర్చిస్తానన్నారు. టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు తదితరాలపై చర్చించి, ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఇప్పటికే కమిటీ వేశామని చెప్పారు.
News October 5, 2025
టాలీవుడ్, బాలీవుడ్ మధ్య తేడా అదే: రాశీ ఖన్నా

టాలీవుడ్లో హీరోయిన్లను చాలా గౌరవిస్తారని రాశీ ఖన్నా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఉన్న తేడాపై ఆమె మాట్లాడారు. ‘తెలుగులో షూటింగ్ రోజూ 9 గంటలే ఉంటుంది. హిందీ, తమిళ ఇండస్ట్రీలో 12 గంటలు పని చేయాలి. దీంతో అలసిపోతాం. నన్ను అభిమానించే వారు తెలుగులోనే ఎక్కువ ఉన్నారు’ అని పేర్కొన్నారు. సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి ఆమె నటించిన ‘తెలుసు కదా’ ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది.