News October 5, 2025
నరసాపురం: నేటి నుంచి పంటి రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

ఉభయగోదావరి జిల్లాల మధ్య గోదావరిలో నిలిచిన పంటి రాకపోకల్ని నేటి నుంచి అధికారులు పునరుద్ధరిస్తున్నట్లు నరసాపురం ఎమ్మార్వో సత్యనారాయణ చెప్పారు. గత వారం రోజులుగా గోదావరి వరద ఉద్ధృతికి ముందస్తుగా సఖినేటిపల్లి- మాధవాయిపాలెం రేవుల మధ్య పంటి రాకపోకల్ని ఆపేశారు. దీంతో లంక ప్రజలు చించినాడ మీదుగా చుట్టూ తిరిగే వచ్చారు. యంత్రాంగం ఈ దారిలో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారికి కష్టాలు తప్పనున్నాయి.
Similar News
News March 25, 2026
నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీ

నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ జి.శివయ్య బుధవారం సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. వార్షిక ఆదాయం, రిజిస్ట్రేషన్ల విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భీమవరం పరిధిలోని 15 కార్యాలయాల ద్వారా ఈ నెల 23 నాటికి రూ.425.17 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం విధుల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News March 25, 2026
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నల్లి పోసియ్య

పెంటపాడు ప్రభుత్వ పాఠశాల వృక్ష శాస్త్ర ఉపాధ్యాయుడు నల్లి పోసియ్య రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం తణుకులో జరిగిన జిల్లా స్థాయి 45 ఏళ్ల విభాగం జావెలిన్ త్రోలో ఆయన ప్రథమ స్థానం సాధించారు. తద్వారా ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న పోటీలకు అర్హత పొందారు. ఆయనను ఎంఈfyలు శ్రీనివాస్, రామకృష్ణ ఘనంగా అభినందించారు.
News March 25, 2026
ప.గో: కొనలేం.. తినలేం..!

పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ భారంగా మారింది. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చోట్ల చికెన్ ధర ఏకంగా రూ. 380కి చేరింది. దీంతో ఫంక్షన్స్ చేసుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. రానున్న రోజుల్లో ధర రూ. 400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.


