News October 5, 2025

ఈ నెల 6న గ్రీవెన్స్ ఉండదు: కలెక్టర్

image

ఈనెల 6 వ తేదీన (సోమవారం) కలెక్టరేట్లో నిర్వహించాల్సిన పిజిఆర్ఎస్ (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. ఆరోజు పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం, విజయనగరం ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేశామని ప్రకటించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News October 5, 2025

ఉత్సవ వేదికలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

విజయనగర ఉత్సవ వేదికలను కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్శనలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, ఏఎస్పీ సౌమ్యలతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

News October 4, 2025

VZM: డ్వాక్రా బజారులో రూ.12 కోట్ల వ్యాపారం

image

ఈ ఏడాది విజయనగరంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేష స్పందన వస్తోందని డీఆర్డీఏ పధక సంచాలకులు శ్రీనివాస్ పాణి అన్నారు. శుక్రవారం డ్వాక్రా బజారును పరిశీలించారు. గత ఏడాది రూ.8కోట్ల అమ్మకాలు జరగగా, ఈ సారి రూ. 12 కోట్ల వరకు అమ్మకాలు సాగే అవకాశం ఉందన్నారు. ఏపీతో పాటు 19 రాష్ట్రాలకు చెందిన మహిళ సంఘాలు పాల్గొన్నాయన్నారు.

News October 4, 2025

నాగార్జున పరిపక్వత లేకుండా మాట్లాడడం తగదు: మజ్జి

image

శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సిరిమానును తిలకించడానికి డిసిసిబిలో అవకాశం ఇవ్వాలని లేఖ రాయడంపై డిసిసిబి ఛైర్మన్ <<17906979>>కిమిడి నాగార్జున<<>> పరిపక్వత లేకుండా మాట్లాడారని జడ్పీ చైర్మన్ మజ్జిశ్రీనివాసరావు విమర్శించారు. శనివారం జిల్లా పరిషత్‌లో ఆయన మాట్లాడారు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు వచ్చే ప్రజాప్రతినిధులకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.