News April 6, 2024

కోహ్లీ సెంచరీ వృథా.. బెంగళూరుకు మరో ఓటమి

image

రాజస్థాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓడిపోయింది. 184 పరుగుల టార్గెట్‌ను RR 19.1 ఓవర్లలో ఛేదించింది. జోస్ బట్లర్(100*), సంజూ శాంసన్ (69) రాణించడంతో ఆ జట్టు సునాయాస విజయం అందుకుంది. కాగా తొలి ఇన్నింగ్సులో కోహ్లీ(113*), డుప్లెసిస్(44) మినహా అందరూ విఫలమవడంతో RCB 183/3 పరుగులకే పరిమితమైంది.

Similar News

News October 9, 2024

నేడు టీడీపీలో చేరనున్న మస్తాన్ రావు, మోపిదేవి

image

AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ నేడు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో వారిద్దరికి సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వీరిద్దరూ వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

News October 9, 2024

INDvsBAN: కొట్టేస్తారా? ఛాన్సిస్తారా?

image

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో 2వ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈనెల 6న జరిగిన తొలి T20లో భారత్ గెలిచింది. ఈరోజు భారత్ గెలిస్తే సిరీస్ వశం కానుంది. బంగ్లా గెలిస్తే సిరీస్ 1-1గా మారి 3వ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈనేపథ్యంలోనే నేటి మ్యాచ్‌లో గెలవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి భారత్ గెలిచి సిరీస్ వశం చేసుకుంటుందా? లేక బంగ్లాకు ఛాన్స్ ఇస్తుందా? వేచి చూడాలి. రా.7గంటలకు మ్యాచ్ ప్రారంభం.

News October 9, 2024

మరో కొత్త కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం?

image

TG: మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలో దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.