News October 5, 2025

ఒకే మొక్కకు 50 కాయలు

image

వజ్రకరూరు మండలం పిసి ప్యాపిలిలో రైతు మీనుగ ఓబులేసు తన పొలంలో వేరుశనగ పంటను సాగు చేశాడు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడం వల్ల పంట దిగుబడి అధికంగా వచ్చిందన్నారు. ఒకే మొక్కకు 50 కాయలు కాశాయంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

Similar News

News March 22, 2026

ఈ జర్నీ అంత సులభం కాదు: అనయా బంగర్

image

ఇటీవల లింగ మార్పిడి <<19387841>>సర్జరీ<<>> చేయించుకున్న భారత్ మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు అనయా బంగర్ SMలో భావోద్వేగ పోస్ట్ చేశారు. అమ్మాయిగా మారాలనే తన నిర్ణయాన్ని తన తండ్రి, ఫ్యామిలీ సపోర్ట్ చేయడం అంత ఈజీగా జరగలేదని తెలిపారు. తన తండ్రి అండగా ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు. అనయాబంగర్‌గా గుర్తింపును మార్చుకున్న ఆర్యన్ బంగర్ 2024లో హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ, రీసెంట్‌‌గా ఈ సర్జరీ చేయించుకున్నారు.

News March 21, 2026

VIJ: అన్న క్యాంటిన్‌లో భోజనం చేసిన కలెక్టర్

image

విద్యాధరపురంలోని అన్న క్యాంటీన్‌లో శనివారం రాత్రి VMC స్పెషల్ ఆఫీసర్ & కలెక్టర్ లక్ష్మీశ భోజనం చేశారు. స్వయంగా తాము క్యూలో ఉండి టోకెన్ తీసుకొని భోజనం చేశారు. క్యాంటిన్ నిర్వహణ, ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలు గురించి అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆహారంలో నాణ్యత లోపిస్తే తమకు వెంటనే క్యూఆర్ కోడ్, ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు.

News March 21, 2026

సహజత్వానికి భంగం కలగకుండా భద్రాచలం ఆలయ అభివృద్ధి: CM

image

TG: భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి 2027 మార్చి 31 నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆదేశించారు.