News October 5, 2025
610 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే ఆఖరు తేదీ

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 610 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ(OCT 7). బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీర్) ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రాతపరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష బెంగళూరులో అక్టోబర్ 25, 26తేదీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.177. వెబ్సైట్: https://bel-india.in/
Similar News
News October 5, 2025
వారిని కఠినంగా శిక్షించాలి: KTR

మధ్యప్రదేశ్ చింద్వారాలో కోల్డ్రిఫ్ <<17918452>>దగ్గు మందు<<>> తాగిన 11 మంది చిన్నారులు మృతిచెందిన ఘటనపై KTR దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా ఘోరం. ఈ మందు తయారు చేసిన కంపెనీ మేనేజ్మెంట్, దానిని అప్రూవ్ చేసిన అథారిటీలను కఠినంగా శిక్షించాలి. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కారకులందరినీ జైలులో వేయాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
News October 5, 2025
5,346 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

<
News October 5, 2025
వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

మటన్లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.