News October 5, 2025

పవన్ కళ్యాణ్ దృష్టికి రాజోలు సమస్యలు

image

రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం జనసేన అధినేతతో జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. శంకరగుప్తం డ్రెయిన్‌ను పరిశీలించాలని పవన్ కళ్యాణ్‌ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెలలోనే ఆయన ముంపు సమస్య పరిశీలనకు నియోజకవర్గానికి వస్తారని పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

బుగ్గారం: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

image

బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామ ఎస్సీకాలనీ వద్ద గల జాతీయ రహదారిపై జగిత్యాల నుండి ధర్మపురి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికీ ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

News March 13, 2026

యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

image

ఒమన్‌లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.

News March 13, 2026

టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

image

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన ప‌థ‌కంపై కుట్ర‌లు చేసినా, నాణ్య‌త త‌గ్గినా క‌ఠిన‌ చ‌ర్య‌లు తప్పవని హెచ్చరించారు.