News October 5, 2025
16న శ్రీశైలానికి మోదీ.. కీలక ప్రతిపాదనలు!

AP: ప్రధాని మోదీ ఈ నెల 16న శ్రీశైల మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. వాటికి రూ.1,600 కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సీఎం, Dy.CM సమక్షంలో ప్రధానికి విన్నవించే ఆస్కారం ఉంది. ప్రతిపాదనల్లో శ్రీశైల క్షేత్ర కారిడార్, నూ క్యూ కాంప్లెక్స్, మండపాల నిర్మాణం తదితరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 5, 2025
రాష్ట్రంలో 118ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తు గడువును TG SLPRB పొడిగించింది. అభ్యర్థులు ఈనెల 11 సా. 5గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు LLBలేదా BL డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3ఏళ్ల ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయి ఉండాలి. వయసు 34ఏళ్లు మించరాదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tgprb.in
News October 5, 2025
బంగారం ధరలు.. ఈ వారమూ పెరుగుతాయా?

మార్కెట్లకు సెలవు కావడంతో ఇవాళ బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,400గా ఉంది. అయితే గత వారం దీనిపై రూ.3,920 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర గత వారం రోజుల్లో రూ.3,600 పెరిగి రూ.1,09,450కు చేరింది. అలాగే కేజీ వెండిపై రూ.6వేలు పెరిగి ప్రస్తుతం రూ. 1,65,000గా ఉంది. ఈ వారం మార్కెట్లు ఎలా ఉంటాయో చూడాలి.
News October 5, 2025
రాష్ట్రంలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

APPSC వివిధ పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి గడువు ముగుస్తోంది. లైబ్రేరియన్ సైన్స్లో JL(2), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(1) పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 7 ఆఖరు తేదీ. డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్- 2(13), AEE (3), హార్టికల్చర్ ఆఫీసర్(2) పోస్టులకు OCT 8 లాస్ట్ డేట్. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://portal-psc.ap.gov.in/