News October 5, 2025
నరసరావుపేటలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే.!

నరసరావుపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం లైవ్ కోడి కేజీ 128 రూపాయలుగా ఉంది. స్కిన్తో రూ. 180 నుంచి రూ. 220 వరకు ఉంది. స్కిన్ లెస్ రూ. 200 నుంచి రూ. 230 పలుకుతోంది. లైవ్ పేపర్ ధర గత వారంతో పోలిస్తే 20 రూపాయలు తగ్గినప్పటికీ చికెన్ ధరను తగ్గించలేదని వినియోగదారులు అంటున్నారు. అదే విధంగా 100 కోడిగుడ్ల రూ. 540. మటన్ కేజీ రూ. 800 నుంచి రూ. 900 లకు అందుబాటులో ఉంది.
Similar News
News March 14, 2026
ఖమ్మం: వారం వ్యవధిలో భార్యాభర్తల మృతి

తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన మెట్టు వెంకన్న (55), ఆయన భార్య రాధ (50) గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఆరు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
News March 14, 2026
వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలంలో స్వామివారి నిత్య కళ్యాణ వేడుక శనివారం కనులపండువగా సాగింది. తెల్లవారుజామునే గర్భాలయంలో సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన అర్చకులు.. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా బేడ మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తర్వాత శాస్త్రోక్తంగా కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ గావించి వేడుకను పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
News March 14, 2026
పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. శనివారం జనగామలోని సెయింట్ మేరీస్ స్కూల్, ధర్మకంచ జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, బయటి వ్యక్తుల ప్రవేశం నిషిద్ధమని స్పష్టం చేశారు.


