News October 5, 2025

వన్డేల్లో కొనసాగడం ఇష్టం లేదా?

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ జట్టులో ఉంటారా అనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ మ్యాచులు ఆడాలని BCCI చెబుతూనే ఉంది. రోహిత్, కోహ్లీ రంజీల్లో అడపాదడపా ఆడి తప్పుకున్నారు. మళ్లీ తిరిగి దేశవాళీ మ్యాచుల్లో ఆడతామన్న సంకేతాలివ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే వారికి వన్డేల్లోనూ కొనసాగేందుకు ఆసక్తి లేదేమోనని సెలక్టర్లు భావిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News March 12, 2026

మోనాలిసా పెళ్లిపై డైరెక్టర్ సంచలన కామెంట్స్

image

కుంభమేళా వైరల్ బ్యూటీ <<19356893>>మోనాలిసా<<>> పెళ్లిపై ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆ అమ్మాయిని నేను గంగామాత అవతారంగా భావిస్తాను. ఆమెతో సినిమా కోసం నేను రూ.10 కోట్లు లోన్ తీసుకున్నాను. జైలుకు కూడా వెళ్లాను. కానీ ఇప్పుడు ఓ ముస్లింతో పారిపోయింది. మొత్తం నాశనం చేసింది. ఇది తిరుగుబాటు కాదు. లవ్ జిహాద్. జైలు బయట వాళ్ల నాన్న ఏడ్చినా ఆమె పట్టించుకోలేదు’ అని తెలిపారు.

News March 12, 2026

విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు జమ

image

TG: రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25కు గాను స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజు కింద వారి ఖాతాల్లో రూ.374 కోట్లు జమ చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.201 కోట్లు, రాష్ట్రం వాటా రూ.173 కోట్లు. ఈ మొత్తంతో 83,239 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరింది.

News March 12, 2026

ఈ మొక్కల్ని నాటితే..

image

వృక్షాలు మానవుడిని నరక ప్రాయం నుంచి రక్షిస్తాయని వరాహ పురాణం పేర్కొంది. రావి, వేప, మర్రి, దానిమ్మ, మామిడి వంటి పండ్ల చెట్లతో పాటు 10 పూల మొక్కలను నాటితే వారు నరకానికి వెళ్లరని శాస్త్ర వచనం. మనం పెంచే మొక్కలే మరుజన్మలో మనకు సంతానంగా మారుతాయని, వృక్షాలకు కూడా సుఖదుఃఖాలు ఉంటాయని, వాటిని నరకడం పాపమని మనుస్మృతి హెచ్చరిస్తోంది. కాబట్టి మన సంతోషం కోసం, లోక కళ్యాణం కోసం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి.