News October 5, 2025
వన్డేల్లో కొనసాగడం ఇష్టం లేదా?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ జట్టులో ఉంటారా అనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ మ్యాచులు ఆడాలని BCCI చెబుతూనే ఉంది. రోహిత్, కోహ్లీ రంజీల్లో అడపాదడపా ఆడి తప్పుకున్నారు. మళ్లీ తిరిగి దేశవాళీ మ్యాచుల్లో ఆడతామన్న సంకేతాలివ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే వారికి వన్డేల్లోనూ కొనసాగేందుకు ఆసక్తి లేదేమోనని సెలక్టర్లు భావిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News October 5, 2025
భారత్తో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్

మహిళల క్రికెట్ WCలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇండియా: ప్రతికా, స్మృతి మంధాన, హర్లిన్, హర్మన్(C), రోడ్రిగ్స్, దీప్తీ శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, రేణుక, క్రాంతి, శ్రీ చరణి
పాక్: మునీబా, సాదక్, సిద్రా అమిన్, రమీన్, అలియా, నవాజ్, ఫాతిమా(C), నటాలియా, డయానా, నష్రా, సదియా
News October 5, 2025
డార్జిలింగ్ విషాదంపై స్పందించిన రాష్ట్రపతి

<<17919840>>డార్జిలింగ్<<>>లో కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన ప్రాణనష్టం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నామని Xలో వెల్లడించారు.
News October 5, 2025
రాముడు పుట్టక ముందే ఆయన్ని కొలిచాడు

అగస్త్యుని శిష్యుడు సుతీక్ష్ణుడు. గురుదక్షిణగా అగస్త్యుడు, సుతీక్ష్ణుడ్ని శ్రీరాముడి దర్శనం కల్పించమని ఆదేశిస్తాడు. అప్పటికి రాముడింకా జన్మించడు. అయినా సుతీక్ష్ణుడు అడవిలోకి వెళ్లి ఆయన కోసం తపస్సు చేస్తాడు. ఆహారం తీసుకోడు. నీళ్లు కూడా ముట్టడు. ఆయన శరీరం ఎముకల గూడులా మారుతుంది. చివరికి రాముడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆలింగనం ఇస్తాడు. అందుకే అసలైన భక్తికి సుతీక్ష్ణుడు నిదర్శనం అని అంటారు. <<-se>>#Bakthi<<>>