News October 5, 2025

పెద్దిపాలెం హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

image

ఆనందపురం మండలం పెద్దిపాలెం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం నుంచి మధురవాడ వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సన్యాసమ్మ (41) హఠాత్తుగా పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కొమ్మాది ప్రాంతానికి చెందిన రామసూరి భార్యగా పోలీసులు గుర్తించారు. ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 5, 2025

దసరా రద్దీ నియంత్రణ కోసం భోగీలు పెంచిన రైల్వే అధికారులు 2/1

image

దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యార్ధం అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు పలు ట్రైన్‌లలో అదనపు భోగీలు పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
➤18526/18525 విశాఖపట్నం- బరంపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ – 2 భోగీలు
➤22820/22819 విశాఖపట్నం- భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ – 2 భోగీలు
➤18512/18511 విశాఖపట్నం-కోరాపుట్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ – 2 భోగీలు

News October 5, 2025

దసరా రద్దీ నియంత్రణ కోసం భోగీలు పెంచిన రైల్వే అధికారులు 2/2

image

➤58528/58527 విశాఖ -రాయపూర్- విశాఖ ప్యాసింజర్ – 2 భోగీలు
➤58538/58537 విశాఖపట్నం -కోరాపుట్- విశాఖపట్నం ప్యాసింజర్- 2 భోగీలు
➤58532/58531 విశాఖపట్నం -బరంపూర్- విశాఖపట్నం ప్యాసింజర్-1 భోగీ
➤58504/58503 విశాఖపట్నం -భవానిపట్న- విశాఖపట్నం ప్యాసింజర్- 2 భోగీలు
➤58506/58505 విశాఖపట్నం -గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ – స్లీపర్ భోగి-1, జనరల్ భోగి -1
ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

News October 5, 2025

ఎన్‌ఏడీలో తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!

image

విశాఖలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పనులు వేగవంతమయ్యాయి. ఎన్‌ఏడీ నుంచి కాకానినగర్ వరకు 11 మీటర్ల వెడల్పుతో తేలికపాటి వాహనాల కోసం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గాజువాక వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం సులభతరం కానుంది.