News October 5, 2025
డీమార్ట్ ఆదాయం పెరుగుదల

డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆదాయం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆ సంస్థ ఆదాయం రూ.16,219 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.14,050కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. 2025 సెప్టెంబర్ నాటికి దేశంలో డీమార్ట్ స్టోర్ల సంఖ్య 432కు చేరింది. ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో డీమార్ట్ బిజినెస్ నిర్వహిస్తోంది.
Similar News
News October 5, 2025
తెలంగాణలో కోల్డ్రిఫ్ సిరప్పై నిషేధం

TG: రాష్ట్రంలో కోల్డ్రిఫ్ <<17918452>>దగ్గు మందు<<>>సిరప్పై ప్రభుత్వం నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వల్ల 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దగ్గు మందులో 42% విష రసాయనం(DEG) ఉన్నట్లు తేలింది. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు దీన్ని బ్యాన్ చేశాయి.
News October 5, 2025
భారత్తో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్

మహిళల క్రికెట్ WCలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇండియా: ప్రతికా, స్మృతి మంధాన, హర్లిన్, హర్మన్(C), రోడ్రిగ్స్, దీప్తీ శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, రేణుక, క్రాంతి, శ్రీ చరణి
పాక్: మునీబా, సాదక్, సిద్రా అమిన్, రమీన్, అలియా, నవాజ్, ఫాతిమా(C), నటాలియా, డయానా, నష్రా, సదియా
News October 5, 2025
డార్జిలింగ్ విషాదంపై స్పందించిన రాష్ట్రపతి

<<17919840>>డార్జిలింగ్<<>>లో కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన ప్రాణనష్టం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నామని Xలో వెల్లడించారు.