News April 7, 2024

HYD: ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్.. ఇదే అదునుగా కమిషన్..?

image

HYDలో ఈ వేసవిలో ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. దీనినే అదునుగా చేసుకుని కొంత మంది HMWSSB ట్యాంకర్ డ్రైవర్లు వినియోగదారుల వద్దకు వెళ్లి కమిషన్ అడుగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మెహదీపట్నం సెక్షన్ పరిధిలో ఓ వ్యక్తి ట్యాంకర్ బుక్ చేశాడు. ఒక ట్యాంకర్ ఖరీదు రూ.500 కాగా చేతి ఖర్చుల పేరిట రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన HMWSSB అధికారులు అలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 2, 2025

HYDలో KCR చేసింది ఏం ఉంది: CM రేవంత్ రెడ్డి

image

HYDలో KCR అభివృద్ధి చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రగడ్డలో నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా CM రోడ్‌ షో‌ నిర్వహించారు. ‘సిటీకి YSR మెట్రో తెచ్చారు. ORR, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంగ్రెస్ నిర్మించింది. IT, ఫార్మా కంపెనీలు మేమే తీసుకొచ్చాము. చంద్రబాబు నాయుడు, YS రాజశేఖర్ రెడ్డి వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మరి HYDలో KCR చేసింది ఏం ఉంది’ అంటూ రేవంత్ నిలదీశారు. దీనిపై మీ కామెంట్?

News November 1, 2025

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం కలకలం

image

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

రేవంత్‌‌‌కు KTR “జూబ్లీహిల్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్” కౌంటర్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముమ్మరం కావడంతో BRS పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలుపై రేవంత్ రెడ్డి, KTR ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు KTR త్వరలో కౌంటర్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. BRS హయాంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా చేపట్టిన ఫ్లైఓవర్లు, మెట్రో రైలు, ఫ్రీ వాటర్ ఇతర అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వనున్నారు.