News April 7, 2024
ఎన్నికల నియమావళిని పాటించాలి: సబ్ కలెక్టర్

కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి శనివారం సమావేశం నిర్వహించారు. నేతలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పార్టీ కరపత్రాలపై ప్రింటింగ్ ప్రెస్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించాలన్నారు. కందుకూరులో 55 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించి భద్రత పెంచామని సబ్ కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 8, 2025
కనిగిరిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కనిగిరిలోని కూచిపూడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు.. కూచిపూడిపల్లికి చెందిన జొన్నలగడ్డ సృజన్ (52) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 8, 2025
పెద్ద చెర్లోపల్లిలో పర్యటించనున్న CM చంద్రబాబు

CM చంద్రబాబు నాయుడు ఈనెల 11న పెద్ద చెర్లోపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి సీఎంఓ నుంచి సమాచారం అందిందన్నారు. మండలంలోని లింగన్నపాలెంలో MSME పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు. CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు MLA లింగన్నపాలెంకు బయలుదేరి వెళ్లారు.
News November 8, 2025
భక్త కనకదాస రచనలు అనుసరణీయం: ఎస్పీ

భక్త కనకదాస జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కనక దాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. కనకదాస రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని కుల అసమానతలను రూపుమాపేందుకు కనకదాస చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన రచనలు ప్రజల్లో భక్తి, సమానత్వం, న్యాయం, సత్యం వంటి విలువలను బోధించాయని పేర్కొన్నారు.


