News October 5, 2025
ములుగు జిల్లాలో కొనసాగుతున్న ఎల్లో అలర్ట్

ములుగు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 25.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటున ప్రతి మండలంలో 2.7 సెంటీమీటర్ల వాన పడింది. అత్యధికంగా ఏటూరునాగారం మండలంలో 10.8 సెంటీమీటర్లు, వాజేడులో 3.4, మంగపేటలో 3.0, వెంకటాపురంలో 2.5, ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి మండలాల్లో 1.1 సెంటీమీటర్ చొప్పున వర్షం పడింది. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News March 27, 2026
IPL 2026 ఓపెనింగ్ సెరిమనీ రద్దు!

ఈ ఏడాది IPL ఓపెనింగ్ సెరిమనీ ఉండదు. గతేడాది జూన్ 4న బెంగళూరు స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఈసారి వేడుకలు నిర్వహించొద్దని BCCI నిర్ణయించింది. అందుకే శనివారం జరిగే ఫస్ట్ మ్యాచ్ ముందు ఎలాంటి సెలబ్రేషన్స్ చేయట్లేదు. అయితే మే 31న జరిగే ఫైనల్ రోజు మాత్రం గ్రాండ్ క్లోజింగ్ సెరిమనీ ప్లాన్ చేస్తున్నారు.
News March 27, 2026
పెద్దపల్లి: మే 11 నుంచి జనగణన 2027 ప్రారంభం: కలెక్టర్

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జనగణన 2027 హౌస్ లిస్టింగ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా నిజమైన సమాచారం అందించాలని, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. సిబ్బందికి డేటా సేకరణ, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. జనగణన మే 11 నుంచి ప్రారంభమై భవిష్యత్ సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం ఖచ్చిత గణాంకాలు సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు.
News March 27, 2026
పెద్దపల్లి: మే 11 నుంచి జనగణన 2027 ప్రారంభం: కలెక్టర్

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జనగణన 2027 హౌస్ లిస్టింగ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా నిజమైన సమాచారం అందించాలని, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. సిబ్బందికి డేటా సేకరణ, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. జనగణన మే 11 నుంచి ప్రారంభమై భవిష్యత్ సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం ఖచ్చిత గణాంకాలు సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు.


