News October 5, 2025
కరూర్ తొక్కిసలాట ప్లాన్డ్ ఇన్సిడెంట్: ఖుష్బూ

TVK చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇది ప్లాన్/క్రియేట్ చేసిన ప్రమాదంగా నటి, BJP నేత ఖుష్బూ ఆరోపించారు. ‘తొక్కిసలాట నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. ఇది సృష్టించిన విపత్తులా కనిపిస్తోంది. విజయ్ కోసం ఎంతమంది జనం వస్తారో ప్రభుత్వానికి తెలిసినా ర్యాలీకి సరైన స్థలం కేటాయించలేదు. CM మౌనం వీడి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News October 5, 2025
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి: CBN

AP: శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆలయంలో వసతుల కల్పనపై Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం రామనారాయణ, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర ప్రముఖ ఆలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలం అభివృద్ధి చేద్దామని సీఎంకు వారు సూచించినట్లు తెలుస్తోంది. ఆలయ అభివృద్ధికి భూమిని కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
News October 5, 2025
బిహార్ రాష్ట్రంలా మారిన ఏపీ: వైసీపీ

AP: కూటమి పాలనలో ఏపీ ఇప్పుడు బిహార్లా తయారైందని వైసీపీ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరవైందని విమర్శించింది. ఎమ్మెల్యేలు రౌడీల అవతారం ఎత్తి పారిశ్రామికవేత్తలకు హుకుం జారీ చేస్తున్నారని దుయ్యబట్టింది. వారికి వాటాలు ఇవ్వకపోతే కంపెనీలు నడవని పరిస్థితి నెలకొందని, దీంతో పెట్టుబడులకు ఏపీ సురక్షితం కాదని NRIలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాసుకొచ్చింది.
News October 5, 2025
రాజీనామాకు సిద్ధమవుతున్న దానం?

ఖైరతాబాద్ MLA పదవికి దానం నాగేందర్ రాజీనామా చేస్తారని సమాచారం. 2023లో BRS నుంచి MLAగా గెలిచి 24లో కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ MPగా పోటీ చేశారని స్పీకర్కు BRS ఆధారాలు ఇచ్చింది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థులపై PCC షార్ట్ లిస్ట్లో ఆయన పేరు లేదు. దీంతో టికెట్ కన్ఫర్మ్కు ముందే రిజైన్ చేస్తే హైకమాండ్ పాజిటివ్గా ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై Way2News ప్రశ్నకు దానం సమాధానం దాటవేశారు.