News October 5, 2025
PGRSను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రతి మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో PGRS నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్జీల సమాచారానికి ప్రజలు కాల్ నం.1100 ఫోన్ చేయవచ్చన్నారు.
Similar News
News October 5, 2025
విశాఖలో స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటయ్యే ప్రాంతాలివే(1/2)

మల్కాపురం గాంధీనగర్ మార్కెట్లో 100, 104 ఏరియాలో 60, ఊర్వశి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టు రోడ్డులో 14, జింక్ గేటు జంక్షన్ వద్ద 29, దువ్వాడ ఫ్లైఓవర్ కింద 24, ఎన్ఏడీ జంక్షన్లో 10, బాజి జంక్షన్లో 5, గోశాల జంక్షన్లో 10, అడవివరం జంక్షన్లో 10, వేపగుంట జంక్షన్లో 15, పెందుర్తిలో 30, నరసింహనగర్లో 14 <<17922709>>దుకాణాలు ఏర్పాటు<<>> చేయనున్నారు.
News October 5, 2025
SRPT: రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రకటించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.
News October 5, 2025
కొడాలి నాని భవిష్యత్తు రాజకీయాలపై ఉత్కంఠ.!

మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని 2024 ఎన్నికల ఓటమి అనంతరం దాదాపు సంవత్సరం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనారోగ్యం, కేసు నమోదు వంటి కారణాలతో ఆయన గుడివాడకు వచ్చారు. అప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న నాని భవిష్యత్తు రాజకీయాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఈ ఉత్కంఠ కొనసాగుతోంది.