News October 5, 2025
చరిత్రలో నిలిచిన నేత ‘కాక’: మంత్రి పొన్నం

హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన గడ్డం వెంకట స్వామి జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మిక చట్టాల్లో సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కాక దేశంలోనే గొప్ప కార్మిక నాయకుడిగా చరిత్రలోనే నిలిచిపోతారని అన్నారు. రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు చిరస్మనీయంగా ఉంటాయని అందులో కాక పేరు అగ్రస్థానంలో ఉంటుందన్నారు. పదవులకు వన్నెతెచ్చిన నేత అన్నారు.
Similar News
News October 5, 2025
మన్యం జిల్లాలో మరో 3 గంటల్లో ఉరుములతో వర్షం

పార్వతీపురం మన్యం జిల్లాలోని రాబోయే 3 గంటల్లో పలుచోట్ల ఉరుములతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గరుగుబిల్లి ప్రాంతాలలో కొన్ని చోట్ల మెరుపులు, ఉరుములతో వర్షం పడుతుందని వెల్లడించారు. గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్లు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
News October 5, 2025
శబరి బ్లాకులో లాయర్లతో TPCC నేతల భేటీ

కాసేపటి క్రితం ఢిల్లీకి చేరిన TPCC ముఖ్య నేతలు తెలంగాణ భవన్ శబరి బ్లాకులో తమ లాయర్లతో భేటీ అయ్యారు. BCలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలు, GO నిలబడేందుకు గల అవకాశాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, BC సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, TPCC చీఫ్ మహేశ్ చర్చిస్తున్నారు.
News October 5, 2025
త్వరలో కురుపాం గురుకులం వెళ్తా: పవన్

AP: అనారోగ్యంతో కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. త్వరలో కురుపాం వెళ్లి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానని పేర్కొన్నారు.