News October 5, 2025

కురుపాం ఘటన.. మంత్రికి సీఎం ఫోన్

image

కురుపాం గురుకుల విద్యార్థినిల మృతి ఘటనపై మంత్రి సంధ్యారాణితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. రేపు కురుపాం పాఠశాలకు వెళ్లి మిగిలిన విద్యార్థినిలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Similar News

News October 5, 2025

మన్యం జిల్లాలో మరో 3 గంటల్లో ఉరుములతో వర్షం

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని రాబోయే 3 గంటల్లో పలుచోట్ల ఉరుములతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గరుగుబిల్లి ప్రాంతాలలో కొన్ని చోట్ల మెరుపులు, ఉరుములతో వర్షం పడుతుందని వెల్లడించారు. గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్లు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

News October 5, 2025

శబరి బ్లాకులో లాయర్లతో TPCC నేతల భేటీ

image

కాసేపటి క్రితం ఢిల్లీకి చేరిన TPCC ముఖ్య నేతలు తెలంగాణ భవన్ శబరి బ్లాకులో తమ లాయర్లతో భేటీ అయ్యారు. BCలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలు, GO నిలబడేందుకు గల అవకాశాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, BC సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, TPCC చీఫ్ మహేశ్ చర్చిస్తున్నారు.

News October 5, 2025

త్వరలో కురుపాం గురుకులం వెళ్తా: పవన్

image

AP: అనారోగ్యంతో కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. త్వరలో కురుపాం వెళ్లి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానని పేర్కొన్నారు.