News October 5, 2025
ఛార్జీల పెంపుతో జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు: కేటీఆర్

TG: ఆర్టీసీ సిటీ బస్సు ఛార్జీల పెంపుపై BRS నేత KTR ధ్వజమెత్తారు. ఒకేసారి రూ.10 పెంచడం దుర్మార్గమని, నిత్యం ప్రయాణించే వారిపై నెలకు రూ.500 వరకు అదనపు భారం పడుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించారని జంట నగరాల ప్రజలపై ఛార్జీల పెంపుతో కక్ష సాధింపు చర్యకు దిగారని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకంతో RTCని దివాళా తీయించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రయాణికుడి నడ్డి విరవాలని చూడటం క్షమించరానిదని ఫైరయ్యారు.
Similar News
News October 5, 2025
శబరి బ్లాకులో లాయర్లతో TPCC నేతల భేటీ

కాసేపటి క్రితం ఢిల్లీకి చేరిన TPCC ముఖ్య నేతలు తెలంగాణ భవన్ శబరి బ్లాకులో తమ లాయర్లతో భేటీ అయ్యారు. BCలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలు, GO నిలబడేందుకు గల అవకాశాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, BC సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, TPCC చీఫ్ మహేశ్ చర్చిస్తున్నారు.
News October 5, 2025
త్వరలో కురుపాం గురుకులం వెళ్తా: పవన్

AP: అనారోగ్యంతో కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. త్వరలో కురుపాం వెళ్లి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానని పేర్కొన్నారు.
News October 5, 2025
పోలింగ్లో 17 మార్పులు.. బిహార్లో స్టార్ట్ (1/3)

1. ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ
2. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు
3. ప్రతి బూత్లో ఓటర్ల సంఖ్య 1500 నుంచి 1200కు తగ్గింపు
4. EVMలపై అభ్యర్థి కలర్ ఫొటో, పెద్ద సైజులో అక్షరాలు
5. బూత్ అధికారి అధికారిక ID కార్డుతో ఉంటారు
6. ప్రతి బూత్లో 100% వెబ్ కాస్టింగ్
7. బూత్ లెవల్ ఏజెంట్లు అందరికీ ట్రైనింగ్
8. బూత్ ఓట్ల లెక్కింపులో తేడాలుంటే అక్కడి VVPATలు కూడా లెక్కిస్తారు