News October 5, 2025
విశాఖలో వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండింగ్ జోన్లు

‘<<17803065>>ఆపరేషన్ లంగ్స్<<>>’లో దుకాణాలు కోల్పోయిన వీధి వ్యాపారులకు 21 ప్రాంతాల్లో GVMC స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసింది. మొత్తం 649దుకాణాలకు స్థలాలను గుర్తించింది. చిరువ్యాపారులు ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు వీలుగా ఈజోన్లు ఏర్పాటు చేశారు. UCDఆధ్వర్యంలో 8జోన్లలో మొత్తం 18,041 వీధి వ్యాపారులను గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు UCDకి 6,755 మంది మాత్రమే రూ.200 చెల్లించి గుర్తింపుకార్డు పొందారు.
Similar News
News October 6, 2025
విశాఖ: ఏ జోన్లో ఎంతమంది వర్తకులున్నారంటే?

ఇటీవల యూసీడీ (UCD) విభాగం ఆధ్వర్యంలో జీవీఎంసీలోని వీధి వర్తకుల సర్వే పూర్తయింది. ఎనిమిది జోన్ల పరిధిలో 18,041 మంది వ్యాపారులను గుర్తించారు. జోన్-1 పరిధిలో 217 మంది, జోన్-2లో 2,965, జోన్-3లో 3,615, జోన్-4లో 2,879, జోన్-5లో 3,510, జోన్-6లో 2,152, జోన్-7లో 154, జోన్-8లో 2,549 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. <<17922542>>వెండింగ్ జోన్ల<<>>ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
News October 6, 2025
5గంటల ఆలస్యంగా తిరుపతి-హౌరా ఎక్సప్రెస్

ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాల్సిన తిరుపతి-హౌరా ఎక్సప్రెస్(20890) 5 గంటల లేటులో నడుస్తోంది. రాత్రి 9 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలియన కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ చేసుకున్న వారు వేరే మార్గం లేక వేచి ఉండాల్సి వచ్చింది.
News October 5, 2025
విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి

విశాఖ విమానాశ్రయానికి కేంద్రమంత్రి జలరవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనావాల్ ఆదివారం రాత్రి చేరుకున్నారు. సోమవారం విశాఖ పోర్టులో భారీ క్యారియర్ నౌక చేరుకుంటున్న నేపథ్యంలో మంత్రి స్వాగతం పలకనున్నారు. సాగర్మాల ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ ఇతర అధికారులు ఉన్నారు.