News October 5, 2025
సత్యదేవుని ఆలయంలో రథోత్సవం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతీ ఆదివారం నిర్వహించే రథోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. వారాంతం కావడంతో రత్నగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వయంగా రథోత్సవంలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. వైభవంగా జరిగిన రథోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు.
Similar News
News October 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: కురుపాం గురుకుల విద్యార్థుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా
* ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం: జగన్
* రేపు బీసీ రిజర్వేషన్లపై SCలో విచారణ.. ఢిల్లీకి కాంగ్రెస్ మంత్రులు
* వరద బాధితులను ఆదుకోలేని నువ్వేం సీఎంవి: హరీశ్ రావు
* తెలంగాణలో కోల్డ్రిఫ్ సిరప్పై నిషేధం
* నవంబర్ 22లోగా బిహార్ ఎన్నికలు పూర్తి.. EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: ఈసీ
* WWCలో పాకిస్థాన్పై టీమ్ ఇండియా విజయం
News October 6, 2025
రేపు ‘స్వచ్ఛాంధ్ర అవార్డుల’ కార్యక్రమం

AP: సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేయనున్నారు. మొత్తం 21 కేటగిరీలలో ఈ పురస్కారాలు అందిస్తుండగా, రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులను CM చేతులమీదుగా అందజేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 6 మున్సిపాలిటీలు, 6 GPలకు చంద్రబాబు పురస్కారాలు ఇవ్వనున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాలను సత్కరించనున్నారు. జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు అందజేయనున్నారు.
News October 6, 2025
మస్క్ ట్వీట్! NETFLIXకు ₹2 లక్షల కోట్ల నష్టం

ఎలాన్ మస్క్ చేసిన Cancel Netflix for the health of your kids ట్వీట్తో నెట్ఫ్లిక్స్ ₹2 లక్షల కోట్లు నష్టపోయింది. USA స్టాక్ మార్కెట్లో సంస్థ విలువ 5 రోజుల్లో $514Bn నుంచి $489Bnకి పడిపోయింది. ఆ సంస్థ 2023లో ఆపేసిన వివాదాస్పద యానిమేటెడ్ సిరీస్ Dead End: Paranormal Park క్లిప్స్ కొన్ని ఇటీవల వైరలయ్యాయి. దీంతో టీనేజర్ను ట్రాన్స్జెండర్గా చూపే కంటెంట్తో పిల్లలు తప్పుదోవ పడతారని మస్క్ మండిపడ్డారు.