News October 5, 2025

SRPT: రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రకటించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.

Similar News

News March 11, 2026

కడప: స్నేహితుడి కోసం పోరాటం.!

image

కడప జిల్లా మైలవరం వాసి D. జిలాని(26) సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లాడు. ఆపరేషన్ చేయాలంటే దాదాపు రూ.15 లక్షలు అవుతుందని బంధువులు తెలిపారు. దీని కోసం అతడి స్నేహితులు ప్రజలలోకి వెళ్లి సాయం కోసం అర్ధిస్తున్నారు. ‘మా స్నేహితుడిని బతికించడానికి సాయం చేయండి’ అంటూ ముందుకు సాగారు. అతడి ఆపరేషన్ కోసం దాతలు, ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు.

News March 11, 2026

కడప జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు ఎన్నంటే.!

image

కడప జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 5,99,802 ఉన్నాయి. ప్రభుత్వం వీటి రీఫిల్ ధరను రూ.60 పెంచింది. దీంతో జిల్లాలోని కుటుంబాలపై ఒక సిలిండర్ వినియోగానికి రూ.3.59 కోట్లు అదనపు భారం పడింది. జిల్లాలో వాణిజ్య వంట గ్యాస్ కనెక్షన్లు 4,769 ఉన్నాయి. వీటిపై రీఫిల్ ధరను రూ.144 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా చిన్న హోటళ్లు, పానిపూరీ, టీ స్టాళ్లలో డొమస్టిక్ గ్యాస్ వాడుతున్నారు.

News March 11, 2026

KNR: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లక్కీ డ్రా..!

image

KNR(D) ఇల్లందకుంట మండలంలో లక్కీ డ్రా పేరిట సాగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. రూ.3500 టికెట్‌తో రూ.90 లక్షల విలువైన ఇల్లు, నగదు బహుమతులు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ఊరిస్తున్నారు. అయితే, ఈ భారీ స్కీమ్‌కు ప్రభుత్వ అనుమతి ఉందా? లేక అధికారుల అండదండలతో సాగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనీ ల్యాండరింగ్‌కు ఆస్కారమున్న ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.