News October 5, 2025

MDK: భూగర్భ జలాలు ఉప్పొం’గంగ’

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో అంతంత మాత్రమే కురిసిన వర్షాలు గత సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో కురవడంతో చాలా ఏళ్ల తర్వాత భూగర్భ జలమట్టాలు ఉబికి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 3.29 మీటర్లు, MDKలో 2.95, SDPTలో 2.11 మీటర్ల చొప్పున జల మట్టాలు పెరిగాయని భూగర్భ జల వనరుల శాఖ తాజా పరిశీలనలో తేలింది.

Similar News

News March 15, 2026

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) అంటే ఏంటి?

image

ఇది పైప్‌లైన్ ద్వారా నేరుగా ఇంటి వంటగదికి చేరుతుంది. మీటర్ ద్వారా వినియోగాన్ని బట్టి బిల్లు వస్తుంది. యూనిట్ ధర దాదాపు రూ.40-60 (క్యూబిక్ మీటర్) వరకు ఉంటుంది. గ్యాస్ అయిపోతుందన్న చింత ఉండదు. సాధారణంగా నెలకు రూ.400-800 బిల్లు వస్తుంది. కనెక్షన్ పొందడానికి రూ.7 వేల వరకు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. HYDలోనూ BGL సంస్థ PNG సౌకర్యం కల్పిస్తోంది. అయితే అన్ని ప్రాంతాల్లో PNG లేకపోవడం పెద్ద సమస్య.

News March 15, 2026

TVKకు 80 సీట్లు, Dy.CM పదవి.. బీజేపీ ఆఫర్?

image

TN అసెంబ్లీ ఎన్నికల్లో BJPతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ పలుమార్లు <<19381860>>చెప్పినా<<>> ఊహాగానాలు ఆగడం లేదు. తాజాగా TVKకు 80 సీట్లు, Dy.CM పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చర్చలు తుదిదశకు చేరుకున్నాయని తెలిపాయి. CM పోస్టుపై విజయ్ దృష్టిపెట్టారని, దీనిపైనే సందిగ్ధత ఉందని పేర్కొన్నాయి. ఈ చర్చల్లో ఓ రాష్ట్ర Dy.CM కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

News March 15, 2026

రేపటి నుంచి మ.12.30 గం. వరకే స్కూళ్లు

image

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7.45AM నుంచి 12.30PM వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అటు తెలంగాణలో 8AM నుంచి 12.30PM వరకు తరగతులు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపించనున్నారు.