News October 5, 2025

విజయనగరంలో విస్తృత తనిఖీలు

image

పైడితల్లమ్మ తొలేళ్ళు, సిరిమానోత్సవం సందర్భంగా పట్టణంలో పలు ప్రాంతాల్లోబాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లుగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఇందుకుగాను ఆదివారం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసామన్నారు. ఈ బృందాలు రైల్వే స్టేషను, ఆర్టీసి కాంప్లెక్సు, శ్రీ పైడితల్లమ్మ ప్రధాన ఆలయం, వనంగుడి దగ్గర ప్రత్యేక భద్రత దళాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయని వెల్లడించారు.

Similar News

News October 5, 2025

VZM ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

image

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగనున్న పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం తెలిపారు. సోమవారం నుంచి పట్టణంలో జరగనున్న శ్రీపైడితల్లి తోలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు, భద్రత విధుల్లో ఉన్న నేపథ్యంలో గ్రీవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు, ఫిర్యాదుదారులు గమనించాలని కోరారు.

News October 5, 2025

విజయనగరంలో ఘనంగా శోభాయాత్ర..

image

విజయనగరం ఉత్సవాల సందర్భంగా ర్యాలీ శోభాయమానంగా ప్రారంభమైంది. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామ సుందర్ రెడ్డి జెండా ఊపి శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. వివిధ జానపద కళలు, కళారూపాలతో ర్యాలీ కనులవిందుగా సాగి, ప్రజలను ఆకట్టుకుంది. ఉత్సవ వేదికలు ప్రజలతో కళకళలాడాయి. కార్యక్రమంలో TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News October 5, 2025

ఉత్సవ వేదికలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

విజయనగర ఉత్సవ వేదికలను కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్శనలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, ఏఎస్పీ సౌమ్యలతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.