News October 5, 2025
త్వరలో కురుపాం గురుకులం వెళ్తా: పవన్

AP: అనారోగ్యంతో కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. త్వరలో కురుపాం వెళ్లి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానని పేర్కొన్నారు.
Similar News
News October 6, 2025
H-1B వీసా ఫీజు పెంపును సమర్థించిన NVIDIA CEO

US అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని NVIDIA కంపెనీ సీఈవో జెన్సన్ హువాంగ్ సమర్థించారు. ఇది ఇమిగ్రెంట్ పాలసీని రీషేప్ చేస్తుందని అన్నారు. ‘ఏ దేశానికి లేని బ్రాండ్ రెపుటేషన్ USకి ఉంది. అదే “ది అమెరికన్ డ్రీమ్”. పేరెంట్స్ వద్ద డబ్బుల్లేకపోయినా నన్ను US పంపారు. ఏమీ లేని స్థాయి నుంచి ఈ పొజిషన్ కు వచ్చా. H-1B వీసా ఫీజు పెంపు వద్ద అక్రమ వలసలు తొలగిపోతాయి’ అని అభిప్రాయపడ్డారు.
News October 6, 2025
పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. భారత్కు 22 మెడల్స్

ఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. భారత్ 22 పతకాలను (6 గోల్డ్, 9 సిల్వర్, 7 బ్రాంజ్) గెలుచుకుంది. పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇండియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా ఈ ఛాంపియన్షిప్లో 100కు పైగా దేశాల నుంచి 2,200 మందికి పైగా అథ్లెట్లు పోటీ పడ్డారు. ఖతార్, UAE, జపాన్ తర్వాత వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను నిర్వహించిన నాలుగో ఆసియా దేశంగా IND నిలిచింది.
News October 6, 2025
₹300Cr క్లబ్లోకి ‘లోక: ఛాప్టర్-1’.. OTTలోకి ఎప్పుడంటే?

కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించిన ‘లోక: ఛాప్టర్-1’ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దీపావళి కానుకగా OTTకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జియో హాట్స్టార్లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.