News October 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: కురుపాం గురుకుల విద్యార్థుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా
* ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం: జగన్
* రేపు బీసీ రిజర్వేషన్లపై SCలో విచారణ.. ఢిల్లీకి కాంగ్రెస్ మంత్రులు
* వరద బాధితులను ఆదుకోలేని నువ్వేం సీఎంవి: హరీశ్ రావు
* తెలంగాణలో కోల్డ్రిఫ్ సిరప్పై నిషేధం
* నవంబర్ 22లోగా బిహార్ ఎన్నికలు పూర్తి.. EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: ఈసీ
* WWCలో పాకిస్థాన్పై టీమ్ ఇండియా విజయం
Similar News
News October 6, 2025
హమాస్తో సానుకూల చర్చలు జరిగాయి: ట్రంప్

హమాస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో వీకెండ్లో సానుకూల చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపన, గాజాలో యుద్ధం ముగింపు, బందీల విడుదలపై జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. ఈజిప్టులో ఇవాళ మరోసారి చర్చలు జరుగుతాయి. ఈ వారంలో ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. దీనిని వేగంగా పూర్తి చేయాలని చెప్పా. సమయం చాలా విలువైంది. లేదంటే భారీ రక్తపాతం జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
News October 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. కాంగ్రెస్ టికెట్ దక్కేదెవరికి?

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీకి పీసీసీ ముగ్గురి పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, CN రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరు ఉపఎన్నిక బరిలో నిలుస్తారో చూడాలి.
News October 6, 2025
శివుణ్ని ఏ సమయంలో దర్శించుకోవాలి?

పరమేశ్వరుని ఆలయానికి సాయంత్రం వెళ్లడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ సమయంలో శివ లింగాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందని అంటున్నారు. రోజు పూర్తయ్యే సమయంలో ఆ లయకారుణ్ని దర్శించుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి తొందరపాటు లేకుండా, ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు. <<-se>>#DharmaSandehalu<<>>