News October 6, 2025

నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News October 6, 2025

శింగనమల వైసీపీ నాయకుడికి వైఎస్ జగన్ కీలక పదవి

image

శింగనమల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి శైలజానాథ్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

News October 5, 2025

జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, ప్రొబేషనరీ ఎస్ఐలకు ఎస్పీ సూచనలు

image

అనంతపురం జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, ప్రొబేషనరీ ఎస్ఐలతో SP జగదీశ్ సమావేశం నిర్వహించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సభలో విధుల్లో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. పారదర్శకత, నిజాయితీ, నిష్పక్షపాతంతో ప్రజలకు సేవ చేయాలని అన్నారు.

News October 5, 2025

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెద్దవడుగూరు విద్యార్థుల ఎంపిక

image

అనంతపురంలో శనివారం నిర్వహించిన SGF జిల్లాస్థాయి క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచిన పెద్దవడుగూరు విద్యార్థులు పలువురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో పల్లవి, భువన చంద్రిక, చిన్న ఓబుల రెడ్డి, జ్ఞానేశ్వర్ (వెయిట్ లిఫ్టింగ్) ఉన్నారని ఉపాధ్యాయుడు మారుతి తెలిపారు. రాష్ట్రస్థాయికి తమ పిల్లలు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.