News October 6, 2025

కామారెడ్డి: ఎన్నికల నగారా.. రాజకీయ కార్యాచరణ వేగం

image

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో కామారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, BRS పార్టీలు ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల విజయం కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతున్నారు.

Similar News

News October 6, 2025

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామగిరి వాసి

image

రామగిరి మండలంలోని శేషంపల్లికి చెందిన శంకరయ్య వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ఆదివారం అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిసి గజమాలతో సత్కరించారు. తనకు రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనవంతుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

News October 6, 2025

పండుగప్ప ధరలకు రెక్కలు..!

image

పశ్చిమ గోదావరి జిల్లాలో పండుగప్ప చేపల ధరలు అమాంతం పెరిగాయి. నాలుగు నెలల క్రితం రూ. 370 ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ. 500కు చేరడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధిక ఆదాయం వస్తుండటంతో చెరువుల రైతులు పండుగప్ప జాతి చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ చేపలు జిల్లా నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయి.

News October 6, 2025

గజ్వేల్: సోషల్ పీజీటీ, టీజీటీ పోస్టుల దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

గజ్వేల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గర్ల్స్ మైనారిటీ పాఠశాలలో ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధారాణి తెలిపారు. గర్ల్స్ స్కూల్‌లో టీజీటీ సోషల్, పీజీటీ సోషల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 7లోగా పాఠశాలలో దరఖాస్తు అందించాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించామని తెలిపారు.