News October 6, 2025
శివుణ్ని ఏ సమయంలో దర్శించుకోవాలి?

పరమేశ్వరుని ఆలయానికి సాయంత్రం వెళ్లడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ సమయంలో శివ లింగాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందని అంటున్నారు. రోజు పూర్తయ్యే సమయంలో ఆ లయకారుణ్ని దర్శించుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి తొందరపాటు లేకుండా, ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు. <<-se>>#DharmaSandehalu<<>>
Similar News
News October 6, 2025
కాంతార ఛాప్టర్-1: నాలుగు రోజుల్లో రూ.310 కోట్లు!

రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ మూవీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. నిన్న రూ.65 కోట్లకుపైగా కలెక్ట్ చేసిందని పేర్కొన్నాయి. అటు బుక్ మై షోలో నిన్న మధ్యాహ్నం వరకు 50 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని మూవీ యూనిట్ పేర్కొంది.
News October 6, 2025
అధిక వర్షాలు.. కూరగాయ పంటల్లో జాగ్రత్తలు

భారీ వర్షాల సమయంలో పొలంలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపేలా చూసుకోవాలి. లేకుంటే పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాలతో విత్తనం మొలకెత్తనప్పుడు లేదా లేత మొక్కలు దెబ్బతిన్నప్పుడు నర్సరీలోనే నారు పెంచుకోవాలి. అంతర సేద్యం చేసి కలుపును తొలగించాలి.
News October 6, 2025
కూరగాయల పంటలపై అధిక వర్షాల ప్రభావం

అధిక వర్షాల వల్ల నీటిలో మునిగిన కూరగాయల పంటల్లో చీడపీడలు, కలుపు బెడద పెరుగుతుంది. టమాటాలో పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు సోకే అవకాశం ఉంది. వంగలో ఆకులు పసుపు రంగులోకి మారటం, పూతరాలటం, అక్షింతల పురుగు, బాక్టీరియా మచ్చ తెగులు, కాయకుళ్లు తెగులు సోకే ఛాన్సుంది. మిరపలో ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు కనిపిస్తాయి. తీగజాతి కూరగాయల్లో అక్షింతల పురుగు, పండు ఈగ, బూడిద తెగులు సోకే అవకాశం ఉంది.